గుడ్‌న్యూస్.. వచ్చేస్తోన్న వందేభారత్ మినీ రైళ్లు.. ఇకపై ప్రయాణం మరింత సులభం!

వందే భారత్ రైలులో ప్రయాణించేవారికి శుభవార్త. అత్యంత వేగంతో నడిచే వందేభారత్ రైలుకు స్లీపర్ కోచ్‌లను కూడా జోడించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మినీ వెర్షన్ అయిన వందే మెట్రో సేవలు త్వరలో దేశంలో ప్రారంభించబడతాయి. వందే మెట్రో డిజైన్ మరియు ఉత్పత్తి ఈ సంవత్సరం పూర్తవుతుంది. వందే మెట్రో సేవలు పెద్ద నగరాల్లోని ప్రజలు తమ పని ప్రదేశం మరియు స్వస్థలాల మధ్య సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సహాయపడే లక్ష్యంతో ప్రారంభించబడతాయి.

ఒక రాష్ట్రంలోని సమీప ప్రాంతాల ప్రయాణికులకు ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం, ప్రధాని మోదీ దృష్టిలో భారతదేశంలో పూర్తిగా తయారు చేయబడిన వందే మెట్రో రైళ్లను త్వరలో దేశంలో ప్రవేశపెట్టనున్నారు” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు

మేము వందే మెట్రోను అభివృద్ధి చేస్తున్నాము. పెద్ద నగరాల చుట్టూ, ప్రజలు పెద్ద నగరానికి పని లేదా విశ్రాంతి కోసం వచ్చి, వారి స్వస్థలానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడే పెద్ద ఆవాసాలు ఉన్నాయి. దాని కోసం, మేము వందే భారత్‌తో ముందుకు వస్తున్నాము. వందే మెట్రోకు సమానం. ఈ ఏడాది డిజైన్ మరియు ఉత్పత్తి పూర్తవుతుంది మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైలు ఉత్పత్తిని వేగవంతం చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు..

400 కిమీ కంటే ఎక్కువ దూరాన్ని ఈ రైళ్లు కేవలం 5 గంటలలో చేరుకుంటున్న విషయం విదితమే. ప్రస్తుతం ఏసీ చైర్ కారు, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఉన్న వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు కూడా తోడైతే రైల్వే ఆదాయం మరింతగా పెరగడంతో పాటు ప్రయాణీకులు తక్కువ సమయంలోనే తమ గమ్యస్థానాలకు చేర్చుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. భారతీయ రైల్వే వందే భారత్‌ రైలులో స్లీపర్ కోచ్‌లను అమర్చేందుకు ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి వస్తే సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణీకులకు సౌకర్యాలను అందించగలదని తేలింది. ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉన్న రూట్లలలో ఈ స్లీపర్ కోచ్ రైళ్లను నడిపితే రైల్వే సంపద కూడా పెరుగుతుందని స్పష్టమైంది. అందుకు తగ్గట్టుగానే రైల్వేశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే వందే భారత్ మినీ రైళ్లు..

ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా, రాయ్ బరేలీ, చెన్నైలలో రైళ్ల తయారీ జరుగుతోంది. భారతదేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతం అయిన తర్వాత, మోదీ ప్రభుత్వం త్వరలోనే సెమీ-హై-స్పీడ్ రైళ్ల మినీ వెర్షన్‌ను నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇందులో కేవలం ఎనిమిది కోచ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ఇక 16-కోచ్‌ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ప్రధాన నగరాల మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. ఇవి సుమారు 6-7 గంటల ప్రయాణ సమయంలో ఆయా నగరాల మధ్య దూరాన్ని కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు వీటి మినీ వెర్షన్ రైళ్లు అమృత్‌సర్-జమ్మూ, కాన్పూర్-ఝాన్సీ, నాగ్‌పూర్-పుణె వంటి నగరాల మధ్య ప్రయాణీకుల భారాన్ని తగ్గించేందుకు ఈ చిన్న సెక్టార్‌లలో నడపాలని కేంద్ర రైల్వేశాఖ సన్నద్ధం అవుతోంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *