విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్ టూర్… ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

పర్యాటకులను ఆకర్శించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వినూత్న ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని పర్యాటకులకు సేవలందిస్తున్నది. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా ఒక ప్రకటన విడుదల చేశారు.

కశ్మీర్ హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర జూలై 29న విశాఖపట్నంలో ప్రారంభమై ఆగస్టు 1న విశాఖపట్నంలో ముగుస్తుంది. ఈ యాత్ర 3 రాత్రులు, 4 పగళ్లుగా ఉంటుంది. మెస్మరైజింగ్ కేరళ ట్రెక్ ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభమై.. ఆగస్టు 15న విశాఖపట్నంలో ముగుస్తుంది. ఇది (5 రాత్రులు, 6 పగళ్లుగా ఉంటుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాస్ విమానాలను ఈ ప్యాకేజీకి అందుబాటులో ఉంచనున్నారు.

ఈ పర్యటనలకు వెళ్లాలని ఆసక్తి ఉన్న వారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా 0891–2500695, చందన్‌కుమార్- 82879 32318, గణనాథ్- 82879 32281 నంబర్లలో సంప్రదించాలని చంద్రమోహన్ తెలిపారు

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ టూరిజం  దేశంలోని పర్యాటక ప్రాంతాలకు మాత్రమే కాదు, విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్స్‌కి కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.
థాయ్‌ల్యాండ్ వెళ్లాలనుకునేవారి కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంటి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్‌కు ‘ఫ్యాసినేటింగ్ థాయ్‌ల్యాండ్’ పేరుతో ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా కవర్ అవుతాయి. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. 2022 డిసెంబర్ 8న టూర్ ప్రారంభం అవుతుంది. వైజాగ్ నుంచి థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ మొదటి రోజు ఉదయం విశాఖపట్నంలో మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే అర్థరాత్రి 1.55 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పట్టాయా బయల్దేరాలి. రెండో రోజు మధ్యాహ్నం నాంగ్ నూచ్ గార్డెన్ టూర్ సందర్శన ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో చూడొచ్చు. రాత్రికి పట్టాయాలో బస చేయాలి.

మూడో రోజు పట్టాయా సందర్శన ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ మీదుగా కోరల్ ఐల్యాండ్ తీసుకెళ్తారు. మధ్యాహ్నం ఇండియన్ రెస్టారెంట్‌లో లంచ్ ఉంటుంది. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్లాలి. బ్యాంకాక్ చేరుకున్న తర్వాత సఫారీ వాల్డ్ టూర్ ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాలి.

ఐదో రోజు బ్యాంకాక్ హాఫ్ డే టూర్ ఉంటుంది. గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ చూడొచ్చు. సాయంత్రం షాపింగ్ కోసం సమయం ఉంటుంది. రాత్రికి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. బ్యాంకాక్‌లో అర్ధరాత్రి 2.55 గంటలకు బయల్దేరితే ఆరో రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధర

ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.63,310 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, పట్టాయాలో రెండు రాత్రులు, బ్యాంకాక్‌లో ఒక రాత్రి బస, బ్రేక్‌ఫాస్ట్, 2 రోజులు డిన్నర్, లంచ్, అల్కజార్ షో, స్పీడ్ బోట్‌లో కోరల్ ఐల్యాండ్, సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్, హాఫ్ డే బ్యాంకాక్ టెంపుల్ సిటీ టూర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ కోసం ఒకరికి 2000 థాయ్ భట్ చెల్లించాలి.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *