మ్యాజిక్ చేసిన 5 పైసల స్టాక్.. లక్షను రూ.5.40 కోట్లు చేసింది.. మీదగ్గర ఉందా..

మ్యాజిక్ చేసిన 5 పైసల స్టాక్.. లక్షను రూ.5.40 కోట్లు చేసింది.. మీదగ్గర ఉందా..

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవని చాలా మంది భావిస్తుంటారు. కానీ జాగ్రత్తగా మార్కెట్లను గమనిస్తూ ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఆరంభంలో బాగా నష్టంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ 30 ప్యాక్‌లో దాదాపు 20 వరకు షేర్లు డీలాపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్ ఎక్కువగా నష్టపోయాయి. ఆర్థిక షేర్లపై అధిక ప్రభావం పడుతోంది. నిఫ్టీ బ్యాంక్ ఒక శాతం కుదేలైంది. IT ఇండెక్స్ 0.6 శాతం మేర పెరిగింది. యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, టీసీఎస్, విప్రో రాణిస్తుండగా.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు పతనం అయ్యాయి.

అయితే ఇన్వెస్టర్ల పంట పండించిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అపర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్‌హోల్డర్లను లక్షాధికారుల్ని చేసింది. రెండేళ్లలోనే అదిరిపోయే రిటర్న్స్ అందించింది. ఈ సమయంలో కంపెనీ షేరు ధర కూడా ఎన్నో రెట్లు పెరగడం విశేషం. 2020 అక్టోబర్ 20న రూ.282.75గా ఉన్న షేరు ధర.. 2022 అక్టోబర్ 18 నాటికి రూ. 1494కు పెరిగింది. ఈ రెండేళ్ల హోల్డింగ్ పీరియడ్‌లో 428 శాతం మేర పెరిగిందన్న మాట. నిన్న ఇది 52 వారాల గరిష్ట విలువ రూ.1557ను తాకి వెనక్కి వచ్చింది. రెండేళ్ల కిందట సరిగ్గా రూ. లక్ష పెట్టుబడి పెడితే అది నేడు రూ.5.28 లక్షలుగా మారింది.

రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్ మెంట్స్ చేసేవారే మిలీనియర్స్ అవుతారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేసింది ఒక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్.

ఈ స్టాక్ తన దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఏకంగా 52,430 శాతం బలమైన రాబడిని అందించింది షేర్ ధర హిస్టరీ..

ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ షేర్ ధర హిస్టరీని గమనిస్తే.. 20 ఏళ్ల కిందట షేర్ ధర కేవలం 5 పైసలు మాత్రమే. ప్రస్తుతం ఈ పెన్నీ స్టాక్ ధర రూ.293 రూపాయలకు చేరుకుంది. అంటే 2002 అక్టోబర్ లో ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి.. దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే అతను దాదాపు రూ.5.45 కోట్లను పొందేవారు. దీర్ఘకాలం సరైన కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని కంపెనీ మరోసారి నిరూపించింది.

కంపెనీ వివరాలు..

ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మిలియనీర్ కావచ్చని ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్‌ స్టాక్ నిరూపించింది. తన ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చి చూపించింది ఈ పెన్నీ స్టాక్. గడచిన 20 ఏళ్ల కాలంలో పెట్టుబడిదారులకు స్టాక్ 52,430 శాతం రిటర్న్స్ అందించింది.

జూన్ లో గరిష్ఠ స్థాయికి.

ఈ స్టాక్ 2021 జూన్ లో తన జీవితకాల గరిష్ఠమైన రూ.366ను తాకింది. ఆ సమయంలో లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ.6.65 కోట్లకు చేరుకుంది. ఈ రోజు స్టాక్ ధర రూ.297.75 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.167.25 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.308గా ఉంది.

కంపెనీ బిజినెస్..

ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ చమురు, గ్యాస్ లాజిస్టిక్స్‌లో ప్రధానమైనది. 1956లో స్థాపించబడిన ఈ కంపెనీ 462 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ ఆదాయం Q1FY22లో రూ.678 కోట్లు ఉండగా.. ఈ ఏడాది అది రూ.2,235 కోట్లకు చేరుకుంది. కిందటి త్రైమాసికంలో Q2లో రూ.2,103 కోట్ల ఆదాయానికి.. రూ.107 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు నమోదు చేసింది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *