అంతర్జాతీయం

ఉద్యోగం కోల్పోయారా? అయితే మా కంపెనీకి రండి.

ఉద్యోగం కోల్పోయారా? అయితే మా కంపెనీకి రండి.

అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలైన ట్విటర్, మెటా ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. యాపిల్‌, అమెజాన్, అల్ఫాబెట్‌ వంటి దిగ్గజ సంస్థల్లో కూడా నియామక ప్రక్రియ నెమ్మదించింది. నైపుణ్యం  ఉన్న వారికి అవకాశాలకు కొదువ లేదు. ఒకప్పటిలాఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. టాలెంట్ (Talent)​ ఉంటే ఎన్నో అవకాశాలు మన కళ్ల ముందున్నాయి. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా మన స్కిల్స్​ను మార్చుకుంటూ వెళ్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అయితే, ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో…

స్కాన్‌ చేయండి.. నగరాన్ని ముందుంచండి

స్కాన్‌ చేయండి.. నగరాన్ని ముందుంచండి

నగరంలో ప్రజల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సిటిజన్‌ పర్‌సెప్షన్‌ సర్వే(సీపీఎస్‌)లో హైదరాబాద్‌ను ముందుంచాలని జీహెచ్‌ఎంసీ పిలుపునిచ్చింది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 264 నగరాల్లో బుధవారం సర్వే ప్రారంభించింది. జీవన ప్రమాణాలు, ఆర్థిక స్తోమత, సుస్థిరతలను తెలుసుకోవడమే సర్వే ముఖ్యోద్దేశం. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌-2022 నివేదిక రూపకల్పనకు ఆయా అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. పౌరులు సర్వేలో పాల్గొని నగరాన్ని మొదటి స్థానంలో ఉంచాలని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ కోరారు. ఇంటి అద్దె, ప్రజా రవాణా…

స్పేస్‌లోకి దూసుకెళ్లనున్న తొలి ఇండియన్ ప్రైవేట్ రాకెట్.. హైదరాబాద్ కంపెనీ ఘనత

స్పేస్‌లోకి దూసుకెళ్లనున్న తొలి ఇండియన్ ప్రైవేట్ రాకెట్.. హైదరాబాద్ కంపెనీ ఘనత

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ రాకెట్ తయారీ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్ ‘ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కి చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఏరోస్పేస్ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్‌గా ప్రవేశించబోతోంది. అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్-రామన్‌ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజాగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది. భారత్‌లో ఈ మైల్‌…

రాజభోగాలు వదులుకుని.. ఆయన వెంట వెళ్లిపోయిన యువరాణి

రాజభోగాలు వదులుకుని.. ఆయన వెంట వెళ్లిపోయిన యువరాణి

అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్‌ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు…

సహారా ఇండియాలో మీ డబ్బు ఇరుక్కుందా.. అయితే ఈ వార్త మీకోసమే..

సహారా ఇండియాలో మీ డబ్బు ఇరుక్కుందా.. అయితే ఈ వార్త మీకోసమే..

సహారా గ్రూప్ గురించి తెలియని వారు ఉండరన్నది అతిశయోక్తి కాదు. ఎందుకంటే రెండు దశాబ్దాల కిందట చాలా మంది చిన్న పొదుపరులు తమ డబ్బును అధిక రాబడుల కోసం ఈ కంపెనీలో డిపాజిట్ల రూపంలో పెట్టుబడి పెట్టారు. అయితే ఆ తర్వాత కంపెనీ ఏమైందో మనందరికీ తెలిసిందే. అలా ఈ కంపెనీలో చాలా మంది డబ్బు చిక్కుకుపోయింది. దానిని తిరిగిపొందేందుకు ఉన్న మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ డబ్బు కూడా సహారా ఇండియాలో చిక్కుకుపోయి ఉంటే,…

ఇంట్లో పని చేయమని భార్యకు చెప్పడం గృహహింస కాదు..వివాహిత పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు

ఇంట్లో పని చేయమని భార్యకు చెప్పడం గృహహింస కాదు..వివాహిత పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు

ఇంట్లో పని చేయమని వివాహితకు అత్తింటి వారు చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా భాగ్యనగర్ పోలీస్ స్టేషన్ లో మహిళ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. సదరు వివాహిత భర్త, అత్తామామలపై గృహహింస కేసు పెట్టింది. పెళ్లి చేసుకున్న నెల రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అత్తింటి వారు పనంతా తనతోనే చేయించుకుంటున్నారని, పని మనిషిలా పని చేయించుకుంటున్నారని మహిళ…

కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉండనుందా ? ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పోలీసులకు భిన్నరకాల యూనిఫాంలు ఉన్నాయి. అయితే ఇది మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో నిర్వహిస్తున్న ‘‘చింతన్ శివిర్’’కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని మోదీ…

ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ

ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి పోలీస్ కానిస్టేబుల్ఉద్యోగానికిఎంపికయ్యారు. ఆడపిల్లలకు చదువులు ఎందుకని వెక్కిరించిన వారి నోళ్లను మూయించారు తమిళనాడుకు చెందిన ముగ్గురు సిస్టర్స్. ఈ విజయంలో తమ తండ్రి కృషి ఎంతగానో ఉందంటున్న ఈ రైతు బిడ్డల సక్సెస్ స్టోరీ చూద్దాం. తమిళనాడులోని రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు వెంకటేశన్‌కు ముగ్గురు కుమార్తెలు. పిల్లల చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో…

రూ.10 కాయిన్స్ తో టూవీలర్ కొన్న యువకుడు

రూ.10 కాయిన్స్ తో టూవీలర్ కొన్న యువకుడు

జనాల్లో ఫేమస్ కావడం కోసం కొంతమంది కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ట్రెండింగ్ లో నిలిచేందుకు సరికొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు. ఎవరైన ఏదైనా వాహనం కొనాలంటే..ముందుగా సెలక్ట్ చేసుకున్న కంపెనీ షోరూమ్ కు వెళ్లి డబ్బులు లేదా చెక్కులు చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం కాయిన్స్ ను తీసుకెళ్లి తమకు నచ్చిన, ఇష్టమైన కలల వాహనాన్ని సొంతం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్ లో…

మహిళను మింగేసిన భారీ కొండచిలువ .. పొట్ట చీల్చి బయటకు తీసిన అధికారులు

మహిళను మింగేసిన భారీ కొండచిలువ .. పొట్ట చీల్చి బయటకు తీసిన అధికారులు

రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన భ మహిళను ఓ కొండచిలువ మింగేసింది. దీంతో అధికారులు ఆ కొండ చిలువ పొట్ట చీల్చి ఆమెను బయటకు తీశారు. ఓ  మహిళను ఓ భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. రబ్బరు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన 54 ఏళ్ల మహిళను మింగేసింది 22 అడుగుల పొడుగున్న భారీ కొండచిలువ. అడవిలోకి వెళ్లిన భార్య ఎంతకీ తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన భర్త ఆమెను వెదుకుతు అడవిలోకి వెళ్లటంతో ఓ ప్రాంతంలో…