కోవిడ్ కలకలం.. భారత్​కు వచ్చిన ప్రయాణికుల్లో 11 రకాల వేరియంట్లు

కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోంది. చైనాతోపాటు వివిధ దేశాల్లో మళ్లీ కోవిడ్‌ కేసులు ప్రబలుతున్నాయి.

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల భయం మొదలవ్వడంతో భారత్‌తో సహా అన్నీ దేశాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. దేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ బి.ఎఫ్‌.7 కేసులు వెలుగుచూడటంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అన్ని విమానాశ్రయాల్లోనూ మాస్కులు ధరించాలని తెలిపింది.

ఈ క్రమంలో విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ రకాల వేరియట్ల కేసులు బయట పడుతున్నాయి. తాజాగా డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు చేసిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వైరస్ వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియట్లేనని స్పష్టం చేశాయి. ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని పేర్కొన్నాయి

మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. 124 మందికి పాజిటివ్‌గా తెలినట్లు పేర్కొన్నాయి. ఈ 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌​బీబీ, ఎక్స్​బీబీ.1 వేరియంట్ ఆనవాళ్లు.. ఒక శాంపిల్​లో బీఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించారు. కాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 188 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,554గా ఉన్నాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది.

వైరస్లు మ్యుటేషన్ ద్వారా నిరంతరం మారుతూ ఉంటాయి మరియు ఇది వైరస్ యొక్క వైవిధ్యాలు ఉద్భవించటానికి కారణమవుతుంది. మ్యుటేషన్ అనేది సహజమైన సంఘటన మరియు వైరస్ యొక్క పరిణామంలో ఒక భాగం. చాలా సార్లు, ఉత్పరివర్తనలు ఉద్భవించాయి మరియు అదృశ్యమవుతాయి, అయితే ఇతరులు కొనసాగుతాయి.

కోవిడ్-19 అనేది

వైరస్ అతిధేయ కణం లేదా గ్రహణశీల శరీరంలోకి ప్రవేశించినప్పుడు ప్రతిరూపం పొందడం ప్రారంభిస్తుంది. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ వ్యాప్తితో రెప్లికేషన్ రేటు పెరుగుతుంది.
మ్యుటేషన్‌కు గురైన వైరస్‌ను వేరియంట్ అంటారు.
వైరస్లు నిరంతరం మారుతాయి మరియు మరింత వైవిధ్యంగా మారతాయి.
శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు ఉత్పరివర్తనలు సంక్రమణ వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయో మరియు లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో లేదో గుర్తించడానికి నిరంతరం పర్యవేక్షించవలసి ఉంటుంది మరియు ప్రస్తుత రోగనిర్ధారణలు, టీకాలు మరియు మందులు వేరియంట్‌లతో పని చేస్తాయా లేదా అని.
వైవిధ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి, ఎందుకంటే లక్షణాల తీవ్రత పెరగడం, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి తగ్గిన రోగనిరోధక శక్తి, వ్యాక్సిన్‌లు లేదా చికిత్సల ప్రభావం తగ్గడం మొదలైన వాటి రూపంలో వేరియంట్‌ల ప్రతికూల ప్రభావాలు దేశంలో ఇప్పటికే భారంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *