వాట్సాప్ వినియోగదారులకు సూపర్ గుడ్ న్యూస్.. అదేమిటంటే

ప్రైవసీ విషయంలో వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వినియోగదారుల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను విడుదల చేసింది వాట్సాప్.
  ప్రైవసీ విషయంలో వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వినియోగదారుల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను విడుదల చేసింది వాట్సాప్. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా కనిపించే ఆప్షన్‌ను హైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది వాట్సప్‌లో కీలకమైన అప్‌డేట్ అని చెప్పాలి. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరికి తెలియకుండా ప్రైవసీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సిగ్నల్ యాప్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాట్సాప్‌లోనూ అందుబాటులోకి వంచ్చింది. ఇక సిగ్నల్‌లో స్క్రీన్ షాట్ బ్లాకింగ్, హిడెన్ కీబోర్డ్ వంటి ఇతర ప్రైవసీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వాట్సాప్‌లో అలాంటి ఫీచర్స్ లేవు. ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం, వారి గోప్యత కోసం ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియకుండా హైడ్ చేయొచ్చు. ఇందుకోసం సెట్టింగ్‌కు వెళ్లి ఫీచర్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియొద్దని ఆ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. అవతలి వారు కూడా ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మీకు తెలియదు. లాస్ట్ సీన్ ఫీచర్ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ తాజా అప్‌డేట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

అయితే, ప్రతీ ఫీచర్‌కు ఒక ప్రతికూలత ఉన్నట్లుగానే.. దీనికీ ఒకటి ఉంది. లేటెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌తో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. వాట్సాప్‌లో ప్రైవసీ విభాగంలో వినియోగదారుడు మూడు ప్రైవసీ ఆప్షన్స్‌ను ఆన్‌లైన్, ప్రొఫైల్ ఫోటో, లాస్ట్ సీన్ హైడ్ చేస్తే.. అవతలి వారు బ్లాక్ చేశారా? లేదా? అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే, ఇందుకు మరో ఆప్షన్ ఉంది. మెసేజ్ పంపిస్తే.. రెండు మార్కులు చూపిస్తే వారు బ్లాక్ చేయలేదని, ఒక మార్క్ మాత్రమే కనిపించి మెసేజ్ డెలివరీ కాకపోతే.. అవతలి వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఇక మొబైల్ డేటా ఆఫ్‌లో ఉన్నప్పుడు చాట్‌ ఒక చెక్ మార్క్‌ను మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ బ్లాక్ చేయనట్లయితే రిసీవర్ డేటా ఆన్ చేయగానే.. చాట్ రెండు చెక్ మార్క్‌లను చూపిస్తుంది.

  ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అయితే రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ వారు కూడా అనేక రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.

ఇప్పటికీ ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఐవోఎస్ వినియోగదారుల కోసం కొత్త ఆప్షన్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వెబ్ వినియోగదారులకు కూడా అనేక రకాల ఆప్షన్లను తీసుకువస్తోంది.

కాగా త్వరలోనే డెస్క్‌టాప్‌ లో వాట్సాప్ వినియోగదారులకు స్క్రీన్ లాక్ చేసే కొత్త ఫీచర్ ను అందించనున్నట్లు ప్రకటించింది వాట్సాప్ సంస్థ. వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ విషయంలో భాగంగానే మరొక అడుగు ముందుకు వేసిన వాట్సాప్ సంస్థ వాట్సాప్ వెబ్లో స్క్రీన్ లాక్ అనే కొత్త ఫ్యూచర్ ను తీసుకురాబోతోంది. వెబ్ ఆప్షన్‌లో వాట్సాప్‌ను తెరిచిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులు తమ డెస్క్‌టాప్‌లో ఉపయోగించనప్పుడు ఇతరులు వారి వాట్సాప్‌ను అనధికారికంగా ఉపయోగించకుండాఈ ఫీచర్ కాపాడుతుంది. అయితే ఈ స్క్రీన్ లాక్ ఫీచర్‌ని వినియోగదారులు వాళ్లకు కావాలి అనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు.

అదేవిధంగా వాట్సాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారుల కోసం మిస్డ్ కాల్ అలర్ట్ అనే కొత్త ఫీచర్ ని కూడా విడుదల చేయబోతోంది. ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ డోంట్ డిస్టర్బ్ మోడ్ లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు వాట్సాప్ లో కాల్ చేస్తే ఈ ఆప్షన్ ను మీకు రిమైండ్ చేస్తుంది. అయితే ఎప్పుడైనా మీరు అనుకోకుండా కాల్ మిస్ చేసినట్లయితే ఈ ఫ్యూచర్ మీకు సమాచారం తెలుపుతుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ని తీసుకురావడానికి వాట్సాప్ సంస్థ అంతా సిద్ధం చేసింది. కాగా ఈ ఫీచర్లు తాజా బీటా వెర్షన్ 2.22.24.7లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్లను ఇప్పటికే కొంతమంది బీటా వాట్సాప్ యూజర్లకు పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *