అగమ్యగోచరంగా IT కంపెనీల భవిష్యత్తు.. టెక్కీల షాకింగ్ నిర్ణయం.. 2025 నాటికి..

ఒక పక్క కంపెనీలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులు ఒక బాంబు లాంటి వార్త బయటపెట్టారు. తాజాగా టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించిన నివేదికలో షాకింగ్ నిజాలు ప్రచురణ కావటం ఐటీ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఒక తలనొప్పి తగ్గుతోంది అని కంపెనీలు భావిస్తున్న సమయంలో మరో తలనొప్పి మెుదలైంది.

ఒక పక్క కంపెనీలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులు ఒక బాంబు లాంటి వార్త బయటపెట్టారు. తాజాగా టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించిన నివేదికలో షాకింగ్ నిజాలు ప్రచురణ కావటం ఐటీ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఒక తలనొప్పి తగ్గుతోంది అని కంపెనీలు భావిస్తున్న సమయంలో మరో తలనొప్పి మెుదలైంది.

టాలెంట్ కొరత..

‘బ్రెయిన్ డ్రెయిన్: ఐటీ సెక్టార్‌లో గ్రేట్ టాలెంట్ ఎక్సోడస్‌ను ఎదుర్కోవడం’ పేరుతో జరిగిన ఈ సర్వేలో రాజీనామాల రేటు 25.2 శాతం ఉంటుందని అంచనా వేయబడింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 50-55 శాతానికి చేరుకుంటుందని తేలింది. అంటే ప్రతి ఇద్దరి ఉద్యోగుల్లో ఒకరు ఐటీ పరిశ్రమకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కంపెనీలను అనుభవజ్ఞులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధించనుంది.

ఇతర రంగాలలోకి..

టెక్కీలు ప్రస్తుతం ఉన్న సంప్రదాయ ఐటీ కంపెనీలకు దూరంగా ఇతర రంగాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా 2025 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు అంచనా. 57 శాతం మంది ఐటి నిపుణులు భవిష్యత్తులో ఐటి సేవల రంగంలోకి తిరిగి రావాలనే ఆలోచనలో లేరని తాజా నివేదికలో వెల్లడైంది.

కోటి ఉద్యోగాలు..

రానున్న కాలంలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 50 లక్షల నుంచి కోటి మందికి చేరుకుంటుందని టీంలీస్ డిజిటల్అంచనా వేసింది. అయితే ఈ క్రమంలో కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగుల జీతాల పెంపు గురించి శ్రద్ధ చూపాలని సూచించింది. రానున్న రెండేళ్ల కాలంలో కంపెనీలు భలమైన నిర్ణయాలు తీసుకోకుంటే అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉద్యోగులను కోల్పోతాయని టీమ్‌లీజ్ డిజిటల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శివ ప్రసాద్ నండూరి అన్నారు.

గరిష్ఠ స్థాయిలకు రాజీనామాల రేటు..

జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ అట్రిషన్ రేటు 19.7 శాతం, ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 28.4 శాతం, విప్రో అట్రిషన్ రేటు 23.3 శాతం, హెచ్‌సీఎల్ అట్రిషన్ రేటు 23.8 శాతంగా ఉండటం కంపెనీల మేనేజ్ మెంట్లకు ఆందోళన కలిగిస్తోంది.

2025 వర్క్‌ఫోర్స్: ఎంటర్‌ప్రైజ్ లెర్నింగ్ అవసరం
ఈ సాంకేతికతలు అనేక కంపెనీలకు భారీ ప్రయోజనాలను కలిగి ఉంటాయి – కానీ అవి పెద్ద సవాళ్లను కూడా సృష్టిస్తాయి. McKinsey నివేదిక ఆ సవాళ్లకు సిద్ధం కావడానికి కొన్ని సూచనలను కలిగి ఉంది, ఉద్యోగి శిక్షణ ద్వారా భవిష్యత్తు అవసరాలను అంచనా వేస్తూ: “పని యొక్క స్వభావం మారుతూనే ఉంటుంది మరియు దానికి బలమైన విద్య మరియు తిరిగి శిక్షణా కార్యక్రమాలు అవసరమవుతాయి.”

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏకీభవిస్తుంది: “దాదాపు అన్ని పరిశ్రమలలో, సాంకేతిక మరియు ఇతర మార్పుల ప్రభావం ఉద్యోగుల ప్రస్తుత నైపుణ్య సెట్ల షెల్ఫ్-జీవితాన్ని తగ్గిస్తుంది. . . . ఈ రోజు మనం దానిని అభివృద్ధి చేయడానికి చర్య తీసుకోకపోతే మార్పులను నిర్వహించడం, ఆకృతి చేయడం మరియు నడిపించడం వంటి ప్రతిభ చాలా తక్కువగా ఉంటుంది. వ్యాపారాలు టాలెంట్ డెవలప్‌మెంట్ మరియు భవిష్యత్ వర్క్‌ఫోర్స్ వ్యూహాన్ని వారి వృద్ధికి ముందు మరియు మధ్యలో ఉంచాలి. సంస్థలు ఇకపై రెడీమేడ్ మానవ మూలధనం యొక్క నిష్క్రియ వినియోగదారులుగా ఉండకూడదు. వారి ప్రతిభ అవసరాలను తీర్చడానికి వారికి కొత్త ఆలోచన అవసరం.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *