వందలో రూ.20 వడ్డీలకే పోతోంది.. పెట్రోల్ సబ్సిడీలో భారీ కోత… బడ్జెట్పై పూర్తి విశ్లేషణ ఇలా..
అవస్థాపనా సౌకర్యాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా అధిక ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు, మహిళలు, అధిక నికర సంపద కలిగిన వ్యక్తులు.. చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి ప్రజలను సంతృప్తి పరిచేలా ఆయావర్గాలకు తాయిళాలు, పథకాలను ప్రకటించడం బడ్జెట్లో గమనించవచ్చు. ద్రవ్యలోటు పూడ్చడానికి అవసరమైన 17.8 ట్రిలియన్ రూపాయల సమీకరణ ప్రభుత్వానికి సవాలుగా నిలిచే అవకాశం ఉంది. అమ్రిత్కాల్ మార్గానికి పటిష్టమైన పునాది సమ్మిళిత వృద్ధి, చివరిమైలుకు చేరుకోవడం,…
థ్యాంక్స్ భారత్ దోస్త్..నిజమైన స్నేహితుడంటూ మోదీ సాయంపై టర్కీ కృతజ్ణతలు
భారత్లో టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ తన దేశంలో సంభవించిన ఘోర భూకంపం తరువాత టర్కీకి అండగా నిలిచినందుకు న్యూఢిల్లీకి ధన్యవాదాలు తెలిపారు టర్కీలో 24 గంటల్లో మూడు విధ్వంసకర భూకంపాలు సంభవించిన తర్వాత దేశానికి నిధులు అందించినందుకు భారతదేశాన్ని “దోస్త్”గా పేర్కొంటూ, భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ, “అవసరంలో ఉన్న స్నేహితుడు నిజంగా స్నేహితుడు” అని అన్నారు. ట్విటర్లో సునేల్ మాట్లాడుతూ, “దోస్త్” అనేది టర్కిష్ మరియు హిందీలో సాధారణ…
గుడ్న్యూస్.. వచ్చేస్తోన్న వందేభారత్ మినీ రైళ్లు.. ఇకపై ప్రయాణం మరింత సులభం!
వందే భారత్ రైలులో ప్రయాణించేవారికి శుభవార్త. అత్యంత వేగంతో నడిచే వందేభారత్ రైలుకు స్లీపర్ కోచ్లను కూడా జోడించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మినీ వెర్షన్ అయిన వందే మెట్రో సేవలు త్వరలో దేశంలో ప్రారంభించబడతాయి. వందే మెట్రో డిజైన్ మరియు ఉత్పత్తి ఈ సంవత్సరం పూర్తవుతుంది. వందే మెట్రో సేవలు పెద్ద నగరాల్లోని ప్రజలు తమ పని ప్రదేశం మరియు స్వస్థలాల…
చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా
అట్లాంటిక్ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్-22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్ ఎగురుతూ కనిపించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్…
ఎపిలో డిజిటల్ రేషన్.
అమరావతి, ఆంధ్రప్రభ: రేషన్ బియ్యం దారి మళ్ళిం పునకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాఫి యా ఆగడాలకు కళ్లెం వేసేందుకు పక్క స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా డిజిటల్ సాంకేతికతను తెరపైకి తేనుం ది. ప్రతి బస్తాకు క్యూఆర్ కోడ్ సీల్ వేయడం ద్వారా అక్రమా లకు చెక్ పెట్టాలని భావిస్తోంది. చెలరేగిపోతున్న రేషన్ మాఫియాను అడ్డుకోవడంలో భాగంగా క్యూ ఆర్ కోడ్ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్తాను ట్రాకింగ్ చేసేందుకు…
భూకంప విలయం.. మరుభూమిని తలపిస్తున్న తుర్కియే, సిరియా నగరాలు
1600 మందికి పైగా మృతి ప్రకృతి ప్రకోపానికి తుర్కియే , సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. తుర్కియే కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది….
ఇంటిగోడల్లో దొరికిన నోట్ల కట్టలు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓనర్కు షాక్.. అసలేం జరిగిందంటే
పాత ఇంటి గోడల్లో అప్పుడప్పుడూ నగలు, నాణేలు, డబ్బులు దొరకడం సహజం. స్పెయిన్లో కూడా ఒక వ్యక్తికి ఇలాగే ఇంటి గోడల్లో భారీ ఎత్తున నగదు దొరికింది. అంత డబ్బు చూసి సంబరపడ్డాడు. అయితే, అతడి సంబరం ఎంతో కాలం నిలవలేదు. స్పెయిన్కు చెందిన టోనో పినేరో అనే వ్యక్తి ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటి గోడను తవ్వగా అతడికి డబ్బు పెట్టెలు బయటపడ్డాయి. గోడ పగలగొట్టి, డబ్బు పెట్టెలు బయటకు తీసి…
పోస్టాఫీసులోని ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మంచి రాబడితోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనం
భారత ప్రభుత్వం దేశంలోని ప్రతి విభాగానికి అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో చాలా చిన్న పొదుపు పథకాలున్నాయి. ఇందులో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో రాబడి అందుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్లు మంచి పెట్టుబడి ఎంపికలు, ఇవి హామీ ఆదాయాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, ఈ పథకాలలో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. భారత ప్రభుత్వం పథకాలకు…
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 1410 కానిస్టేబుల్ జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1410 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 1343, మహిళలకు 67 ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో అడ్వర్టైజ్మెంట్ ను పబ్లిష్ చేసిన 30 రోజుల్లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్ఎఫ్ వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హతల వివరాలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రుకులేషన్ పూర్తి చేసి…