నేడు, రేపు ఉస్మానియా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా.. 250 కంపెనీల్లో 20 వేలకు పైగా జాబ్స్.. కోమటిరెడ్డి ప్రతీక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..

టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. దూరమైన కుమారుడి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కోమటిరెడ్డి. ఆ ఫౌండేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

డన్ & బ్రాడ్‌స్ట్రీట్, జిఇ మనీ, హెచ్‌సిఎల్, ఫ్యాక్ట్‌సెట్ టెక్నాలజీస్, వినిట్, అశోక్ లేలాండ్, హెటెరో డ్రగ్స్ వంటి కొన్ని అగ్రశ్రేణి కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో భాగమయ్యాయి.

హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఉస్మానియా యూనివర్సిటీ అక్టోబర్ 15 మరియు 16, 2022 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిపుణ, ఎన్‌జిఓ, సేవా ఇంటర్నేషనల్ మరియు ఇతర భావసారూప్య ఫౌండేషన్‌ల సహకారంతో రెండు రోజుల కార్యక్రమం జరుగుతోంది.

తాజాగా నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రతీక్ ఫౌండేషణ్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 250 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా ఆ 250 కంపెనీల్లో మొత్తం 20 వేలకు పైగా ఉద్యోగాలను  భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు

ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు చేశారు. ఎన్నో సేవాకార్యక్రమాలలో ముందుండే ప్రతీక్ ఫౌండేషన్ దేశవ్యాప్త యువతను ప్రధానంగా వేధిస్తున్న నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నో ఆశలతో తమ విద్యను పూర్తి చేసుకున్న లక్షల మంది ఉద్యోగార్థులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు

ఈ నేపథ్యంలోనే నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి ఈ నెల 15, 16 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతీక్ ఫౌండేషన్ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్ మెంట్, ఫార్మా మరియు బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక కంపెనీలు ఈ మేళాలో ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నట్లు వివరించారు.

250 కంపెనీలు దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలతో ఈ జాబ్ మేళాలో నిరుద్యోగుల ముందుకు వస్తున్నాయన్నారు. టెన్త్, ఇంటర్ మొదలుకొని బీ.టెక్, ఎం.టెక్, ఎంబీఏ, బీఫార్మా, ఎంఫార్మా, ఇంకా అన్ని డిగ్రీ, పీజీలు పూర్తిచేసుకున్నవారికి ఇదొక చక్కని అవకాశమని వెంకట్ రెడ్డి అన్నారు

ఏ మాత్రం ఉద్యోగానుభవం లేని కొత్తవారికి, 2012-2022 సంవత్సరాల్లో చదువు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశమన్నారు. నిపుణ, సేవా ఇంటర్నేషనల్ తో కలిసి ప్రతీక్ ఫౌండేషన్ అందిస్తున్న ఈ ఉద్యోగావకాశాలను రాష్ట్రంలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు

అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు +91-9032586124, +91-9059186124, +91-9032186124 నంబర్లను సంప్రదించాలని సూచించారు. లేదా www.nipunahds.com, www.techfynder.com/job-seeker, www.hrco.in వెబ్ సైట్లను సందర్శించాలన్నారు

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *