ఇక డెబిట్ కార్డ్ తో పనిలేదు.. ఆధార్ ఉంటే చాలు.!

తిపెద్ద ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ ఫోనెప్ ఇప్పుడు తన యూజర్లకు శుభవార్త అనౌన్స్ చేసింది.ఫోనెప్ యూపీఐ యాక్టివేషన్ కోసం ఇకనుండి డెబిట్ కార్డ్ అవసరం ఉండదని పనిలేదు మరియు మీ ఆధార్ ఉంటే చాలు అని తెలిపింది.

మీ దగ్గర డెబిట్ కార్డ్ లేదా? యూపీఐ పిన్ మార్చడానికి, యూపీఐ యాక్టివేట్ చేయడానికి ఇక డెబిట్ కార్డ్ 
అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉంటే చాలు. మీ ఆధార్ కార్డుతో యూపీఐ పిన్ యాక్టివేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ది

కీలకపాత్ర. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుతం డెబిట్ కార్డ్

ఉన్నవారికే యూపీఐ సేవలు లభిస్తున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల్ని పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

మరో ముందడుగు వేసింది.

ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని బ్యాంకుల్ని కోరింది. అంటే డెబిట్ కార్డ్ అవసరం లేకుండా ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు. దీని వల్ల డెబిట్ కార్డ్ లేనివాళ్లు కూడా యూపీఐ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫలితంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయి

ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి యూపీఐ యాక్టివేట్ చేయాలంటే తప్పనిసరిగా ఏటీఎం కార్డ్ ఉండాలి. తమ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్, ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు ఉంటే చాలు. యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు. యూపీఐ పిన్ జనరేట్ చేయాలన్నా, మార్చాలన్నా ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు తప్పనిసరి

దీనివల్ల ఏటీఎం కార్డులు లేనివాళ్లు యూపీఏ పేమెంట్స్ చేయలేకపోతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త విధానంతో డెబిట్ కార్డ్ లేనివాళ్లు, ఏటీఎం కార్డ్ యాక్టీవ్‌గా లేనివాళ్లు కూడా యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో చేరొచ్చు. యూపీఐ పిన్ మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ ఉంటే చాలు

దీనికోసం, ఆధార్ ఆధారితఓటీపీ ప్రమాణీకరణను ఉపయోగించి యూపీఐ యాక్టివేషన్ చేసే ప్రక్రియను ఫోన్ పే ప్రారంభిచినట్లు పేర్కొంది. అంటే, మీ ఆధార్ కార్డ్ ను ఊపయోగించి చాలా సింపుల్ గా మరియు సురక్షితంగా ఫోనెప్ యూపీఐ ని స్టార్ట్ చేయవచ్చు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, ఫోనెప్ ఇప్పుడు ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్ బోర్డింగ్ ఫ్లో ని అందిస్తున్న మొట్టమొదటి యూపీఐ తర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్  గా నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు ఈ చర్య ద్వారా కోట్ల మంది భారతీయులు యూపీఐ ఎకో సిస్టం లో సజావుగా మరియు సురక్షితంగా భాగం కావడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.

వాస్తవానికి, యూపీఐ ఆన్బోర్డింగ్ విధానంలో ఇప్పటి వరకు డెబిట్ కార్డు తప్పనిసరి. యూపీఐరిజిస్ట్రేషన్ ప్రక్రియలో యూపీఐ పిన్ సెట్ చేయడానికి వినియోగదారులకు చెల్లుబాటు అయ్యే డెబిట్ కార్డ్ తప్పనిసరి. అయితే, ఈ డెబిట్ కార్డ్స్ విధానం ద్వారా డెబిట్ కార్డ్ లేని చాలా మంది యూజర్లు ఈ సర్వీస్ దూరంగా వుంది.

ఈ ఎంపికను ఎంచుకునే వినియోగదారులు ఆన్బోర్డింగ్ ప్రక్రియను మొదలుపెట్టడానికి వారి ఆధార్ నంబర్లోని చివరి 6 అంకెలను మాత్రమే నమోదు చేయాలి. అతంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి యూజర్లు వారి ఉయుడై మరియు వారి సంబంధిత బ్యాంక్ నుండి ఓటీపీ ని  అందుకుంటారు. ఆ తర్వాత, వినియోగదారులు ఫోనెప్ యాప్లో చెల్లింపులు మరియు బ్యాలెన్స్ చెక్ల వంటి అన్ని యూపీఐఫీచర్లను ఉపయోగించగలరు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *