వాయుగుండం, తుపాను ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ఇప్పటికే గత వారం తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తుపాను ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు.