అక్టోబర్ 1 నుంచి వీరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు

కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను నిర్వహిస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1, 2022 నుండి అటల్ పెన్షన్ యోజన  పథకంలో చేరడానికి అర్హులు కాదు.  అనేది అసంఘటిత రంగ కార్మికులలోని భారతీయ పౌరులపై దృష్టి సారించే పథకం

అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల దగ్గర్నుంచి ఉద్యోగుల వరకు వేర్వేరు పెన్షన్ పథకాలు ఉన్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ , ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ , అటల్ పెన్షన్ యోజన లాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి. అయితే ఈ పెన్షన్ పథకాలు అందరికీ వర్తించవు. వీటికి కొన్ని అర్హతలు ఉంటాయి. అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమనిబంధనల్ని మార్చింది. ఇకపై ఈ స్కీమ్‌లో చేరడానికి అందరూ అర్హులు కాదు. అటల్ పెన్షన్ యోజన

పథకంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు చేరకుండా ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం.

కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా సబ్‌స్క్రైబర్ 2022 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరి, ఆ తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా మారితే, వారి ఏపీవై అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని సబ్‌స్క్రైబర్‌కు వెనక్కి ఇచ్చేస్తుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నవారు, ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

. అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్‌లు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD(1) కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. గరిష్టంగా రూ. 1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.

అయితే సెక్షన్ 80CCD (1B) ప్రకారం అదనంగా మరో రూ.50,000 వరకు కంట్రిబ్యూషన్ చేసి మినహాయింపు పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన పథకం ప్రధానంగా అసంఘటిత రంగంలోని వారి కోసం రూపొందించిన పథకం. అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆకర్షణీయమైన ఆప్షన్ అని ఆదిల్ షెట్టి వివరించారు అటల్ పెన్షన్ యోజన పథకం వివరాలు చూస్తే ఈ స్కీమ్ 2015 మే 9న ప్రారంభమైంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పెన్షన్ పథకంలో డబ్బులు జమ చేసినవారికి 60 ఏళ్ల వయస్సు నుంచి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. జమచేసే మొత్తంపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. లబ్ధిదారుల వయస్సును బట్టి రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేయాలి.

అటల్ పెన్షన్‌కు ఎవరు అర్హులు కాదు?
అక్టోబర్ 1 నుండి ఈ పెన్షన్ స్కీమ్ యొక్క ఇమేజ్ ఫలితం వారికి వర్తించదు
పథకం యొక్క సబ్‌స్క్రైబర్‌లు వారి విరాళాలను బట్టి 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్ పొందుతారు. “… అక్టోబర్ 1, 2022 నుండి, ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉన్న లేదా ఉన్న ఏ పౌరుడైనా APYలో చేరడానికి అర్హులు కాదు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *