సామాన్యులకు మరో గుడ్ న్యూస్.. ఉచిత రేషన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ఫ్రీ టీవీ కూడా.. ఖర్చంతా ప్రభుత్వానిదే.

సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది.

ఇళ్లకు ఉచితంగా ఆహార ధాన్యాలు(రేషన్) ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ సర్కార్ ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ.. కేంద్ర

ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల డీడీ ఉచిత డిష్ డీటీహెచ్‌ను పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్‌లు అందించాలని నిర్ణయించింది.

వీటిలో గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు రూ.2,539 కోట్లు వెచ్చించాలని మోదీ ప్రభుత్వ మంత్రివర్గంలో నిర్ణయించింది.

దాదాపు 7 లక్షల మంది ఇళ్లలో ఉచితంగా డిష్ టీవీలను అందించాలని ప్లాన్ చేసింది. ఈ పథకం ద్వారా డీటీహెచ్‌ని మరింతగా విస్తరించాలన్నది కేంద్రం ప్లాన్ . దీంతో పాటు డీడీ పాత స్టూడియోలోని పరికరాలు, ఓబీ వ్యాన్‌ను పూర్తిగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం 28 ప్రాంతీయ వాటితో సహా 36 టీవీ ఛానెల్‌లను నిర్వహిస్తోంది దూరదర్శన్ . సంబంధించిన తయారీ, సేవల ద్వారా పరోక్ష ఉపాధిని సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. డిడి ఫ్రీ డిష్‌ను విస్తరించడం వల్ల డిటిహెచ్ బాక్సుల తయారీలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని యోచిస్తోంది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *